logo

*ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న అక్రిడేషన్ కమిటీలలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ కు ప్రాధాన్యత ఇవ్వవల సిందిగా

*ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న అక్రిడేషన్ కమిటీలలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ కు ప్రాధాన్యత ఇవ్వవల సిందిగా సంఘ అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు,రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయకుమార్ రెడ్డిని కోరారు.*

సోమవారం సాయంత్రం పండిట్ నెహ్రూ బస్టాండ్ కాంప్లెక్స్ లోని ఐ & పి ఆర్ కార్యాలయంలో ఆయనను కలిసి అర్హులైన సంపాదకులకు జర్నలిస్టులకు అక్రిడేషన్లను పునరుద్ధరించే విధంగా కమిటీలు ఉండాలని కోరారు.

గతంలోలాగా కాకుండా జర్నలిస్టు సంఘాలకు ప్రాధాన్యత నివ్వాలని కోరారు.

అలాగే జనవరిలో సమాచార శాఖ ఇచ్చిన ప్రకటన తాలూకు బిల్లులను స్థానిక పత్రిక సంపాదనకు అందజేయాలని కోరారు.

పత్రికా నిర్వహణ కష్టంగా ఉన్న ఈ సమయంలో సంపాదకులకు నెలకు పదివేల రూపాయలకు తగ్గకుండా గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

అలాగే స్థానిక పత్రికలకు నెలకు కనీసం ఒక ప్రకటన ఇచ్చి అండగా ఉండాలన్నారు.

రాష్ట్ర కోశాధికారి డి కోటేశ్వరరావు
అమరావతి అధ్యక్షులు హుమాయున్ తదితరులు రాష్ట్ర అధ్యక్షులు సాంబశివ నాయుడు వెంట ఉన్నారు.

1
783 views